From Wikipedia, the free encyclopedia
శివరాజ్ సింగ్ చౌహాన్ (జననం 1959 మార్చి 5) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజలు ఇతన్ని ముద్దుగా మామాజీ అని పిలుస్తారు.[1]
శివరాజ్ సింగ్ చౌహాన్ | |||
మధ్య ప్రదేశ్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2020 మార్చి 23 | |||
గవర్నరు | లాల్జీ టాండన్ ఆనందిబెన్ పటేల్ | ||
---|---|---|---|
ముందు | కమల్ నాథ్ | ||
పదవీ కాలం 29 నవంబరు 2005 – 17 డిసెంబరు 2018 | |||
ముందు | బాబూలాల్ గౌర్ | ||
తరువాత | కమల్ నాథ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | సీహోర్ జిల్లా, మధ్య ప్రదేశ్, భారతదేశం | 1959 మార్చి 5||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జాతీయ ప్రజాస్వామ్య కూటమి | ||
జీవిత భాగస్వామి | సాధన సింగ్ చౌహాన్ | ||
సంతానం | 2 | ||
సంతకం |
శివరాజ్ సింగ్ చౌహాన్ 1959 మార్చి 5న జన్మించాడు. ఇతని తండ్రి పేరు ప్రేమ్ సింగ్ చౌహాన్, తల్లి శ్రీమతి సుందర్బాయి చౌహాన్. భోపాల్ లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (తత్వశాస్త్రం) లో బంగారు పతకంతో పట్టా పొందాడు.[2] 1975 లో భోపాల్ (మోడల్ హయ్యర్ సెకండరీ స్కూల్) ఆదర్శ్ హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 1976-77 ఎమెర్జెన్సీని వ్యతిరేకించినందుకు భోపాల్ జైలులో ఖైదు చేయబడ్డాడు.[3] ఇతను 1977 నుండి రాష్ట్ర స్వయంసేవక్ సంఘం వాలంటీర్ గా పని చేసాడు. 1992 సంవత్సరంలో సాధనా సింగ్తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.
1977-78లో అఖిల్ భారతీయ విద్యా పరిషత్తు సంస్థలో పదాధికారిగా ఎన్నికయ్యాడు. 1975 నుండి 1980 వరకు మధ్యప్రదేశ్లోని అఖిల్ భారతీయ విద్యా పరిషత్ సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. 1980 నుండి 1982 వరకు అఖిల్ భారతీయ విద్యా పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆ తరువాత 1982-83లో కౌన్సిల్ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా, 1984-85లో భారతీయ జనతా యువ మోర్చా, మధ్యప్రదేశ్ సంయుక్త కార్యదర్శి, 1985 నుండి 1988 వరకు ప్రధాన కార్యదర్శి అలాగే 1988 నుండి 1991 వరకు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు చేపట్టాడు.[4]
చౌహాన్ 2005 లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. చౌహాన్ 2005 నవంబర్ 29న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2008 డిసెంబర్ 10 న చౌహాన్ 143 మంది సభ్యులతో భారతీయ జనతా పార్టీ నుండి శాసనసభ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[5]
2018 శాసనసభ ఎన్నికల్లో భాజపాకు మెజారిటీ రానందున చౌహాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు. ఆ తరువాత కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెసు పార్టీ అధికారం చేపట్టింది. అయితే జ్యోతిరాదిత్య నాయకత్వంలో 22మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు పార్టీకి రాజీనామా చేయడంతో, కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయి, 2020 మార్చి 23న చౌహాన్ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.