భువనచంద్ర
సినీ గేయ రచయిత From Wikipedia, the free encyclopedia
Remove ads
భువనచంద్ర తెలుగు సినీ గేయ రచయిత.
జీవిత విశేషాలు
భువనచంద్ర నూజివీడు దగ్గర గుళ్ళపూడి లో జన్మించారు.[1] ఈయనకు ముగ్గురు అన్నలు, నలుగురు అక్కలు. ఈయన తల్లితండ్రులకు ఎనిమిదో సంతానం. ఎనిమిదవ యేట నుంచీ నవలలు చదవడం ప్రారంభించాడు. ఈయన నాన్న సుబ్రహ్మణ్య శర్మ గ్రామానికి సర్పంచ్ గా ఉండేవాడు. వీరి కుటుంబం, తరువాత చింతలపూడి వచ్చేశారు. ఈయన బడిలో చదివే వయసులో చింతలపూడి గ్రంథాలయంలో చందమామ మొదలైన కథల పుస్తకాలు మొదలుకొని పెద్ద పుస్తకాలను సైతం ఆసక్తిగా చదివే వాడు. రోజూ పాఠశాల నుంచి వచ్చేటపుడు గోడపై సినిమా పోస్టర్ల పై ఉన్న ఆరుద్ర, దాశరథి, ఆత్రేయ, శ్రీశ్రీ మొదలైన పేర్లను చూసి, వాటిపక్కన సుద్ద ముక్కలతో తనపేరు రాసుకునేవాడు. అలా రచయిత కావాలన్న కోరికకు ఆయనకు చిన్నతనంలోనే బీజం పడిందని చెప్పవచ్చు.
చింతలపూడి గ్రామంలో విశ్వనాథాశ్రమం ఉండేది. దానికి స్వామీజీ బోధానందపురి మహరాజ్. అప్పట్లో అక్కడ రాజరాజేశ్వరీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అందులో భాగంగా అక్కడ హరికథలు, దేవీ భాగవతం, యోగావాశిష్టం మొదలైన ఎన్నో కార్యక్రమాలు జరుగుతుండేవి. ఒకసారి ఈయన మిత్రుడు రంగా ప్రసాదం కోసమని బలవంతంగా ఆ దేవాలయానికి ఈడ్చుకునివెళ్ళాడు. అలా కార్యక్రమాలు ఆయన చెవినపడ్డాయి. తరువాత ఇంకా వినాలనిపించింది. తరువాత అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. అలా ఆయన జీవితంలో ఏదో తెలియని మార్పు సంభవించింది. ఆ రోజు నుంచీ, స్కూలు, గ్రంథాలయం, ఆపై ఆశ్రమం ఆయన దినచర్యగా మారింది. స్వామీజీ ప్రసంగాలను నిత్యం వింటూ, మనిషంటే ఏమిటి? దేవుడంటే ఏమిటి? ఇలాంటి తాత్విక చింతనలతో కొద్ది కాలం గడిపేవాడు. చదువు పూర్తయిన తరువాత ఎయిర్ఫోర్స్ లో ఉద్యోగం వచ్చింది.
1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో ఆయన పనిచేశాడు. సరిహద్దు గ్రామాల్లోంచి వెళుతున్నపుడు ప్రజలు ఇచ్చే రొట్టెలు, యుద్ధం చేసి తిరిగి వస్తుంటే దారిపొడవునా సెల్యూట్లు, పంజాబీ, గుజరాతీ మహిళలు కట్టిన రాఖీలు ఆయనకు అపురూపమైన సగర్వంగా గుర్తుంచుకోగలిఏ జ్ఞాపకాలు. ఎయిర్ఫోర్స్ లో ఉండగానే చిన్న చిన్న వ్యాసాలు, కథలు రాసి వివిధ పత్రికలకు పంపేవాడు. ఉద్యోగం చేస్తున్నన్నాళ్ళూ పుస్తక పఠనం వదల్లేదు. సర్వీసులో ఉండగా దాదాపు నాలుగువేల పాటలు రాశాడు. ఎయిర్ఫోర్స్ లో పద్దెనిమిదేళ్ళు తర్వాత సర్వీసు పూర్తయింది. పన్నెండు వేల జీతంతో ఓఎన్జీసీలో ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. కానీ సినీ రచయిత కావాలన్న బలమైన కోరికవల్ల ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి అవకాశాల కోసం మద్రాసు బయలుదేరాడు.
Remove ads
సినీపరిశ్రమలో
అలా మద్రాసు చేరిన ఆయన్ను చంద్రమోహన్ మొదట జంధ్యాల ఇంటికి తీసుకునివెళ్ళారు. ఆయన తీస్తున్న పడమటిసంధ్యారాగం సినిమాకు అవకాశం ఇస్తామన్నారు కానీ దురదృష్టవశాత్తూ అందులో ఆయన ఒక్కపాటా రాయలేకపోయారు. ఆ తర్వాత విజయ బాపినీడుని కలిసి ”నాకూ పెళ్ళాం కావాలి” అనే సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఖైదీ నెం. 786లో ఆయన రాసిన ”గువ్వా... గోరింకతో...” అనే పాట ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, పెద్దరికం మొదలైన హిట్ సినిమాలకు పాటలు రాశాడు. ఇటీవల రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలోని ”రారా.. సరసకు రారా..” అనేపాట అత్యంత ప్రేక్షకాధరణ పొందింది.
ఆయన భార్య శేషసామ్రాజ్య లక్ష్మి, కొడుకు శ్రీనివాస్. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారు. ఏనిమల్ ప్లానెట్ను అమితంగా ఇష్టపడే ఆయన అందులో ప్రకృతిలో మనతో సహజీవనం చేస్తున్న జంతువులు, పక్షుల గురించి తెలుసుకోవడమంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎనిదిన్నరేళ్ళ వయసులో చదివిన ఒక కథ ప్రభావంతో ఆయన అప్పటి నుంచీ మాంసాహారాన్ని పూర్తిగా మానివేశాడు.
Remove ads
పనిచేసిన సినిమాలు
- మహారథి (2007) (lyrics: "Maja Maja", "Uppu Chepa Pappu", "Kamala Kucha Chuchuka")
- జై చిరంజీవ (2005) (writer: "Ko Ko Kodi")
- ఠాగూర్ (2003) (writer: "Vaanochhenante")
- ఇంద్ర (2002) (writer: "Radhe Govinda")
- ఇష్టం (2001)
- చెలి (2001)
- టు లేడీస్ అండ్ జెంటిల్ మేన్ (2001)
- శ్రీ మంజునాథ (2001) (writer: "Oho Garalakanta")
- మృగరాజు (2001) (writer: "Dammentho Choopincharo", "Hungama Hungama")
- వాలి (1999)
- పవిత్ర ప్రేమ (1998): జింగుచక జింగాంగు, ఓ రంగా శ్రీరంగ
- పెళ్ళి చేసుకుందాం (1997): ఓ లైలా లైలా
- చిన్నబ్బాయి (1997): జాజిమల్లి తెల్లచీర
- సింహం (1997): బావా రా
- హలో మొగుడు భలే పెళ్ళాం (1996)
- కుర్రాడు బాబోయ్ (1995) :మస్తానా మస్తానా, సిరివాడ సినమ్మ
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads