ఆర్టికల్ 370
370 / From Wikipedia, the free encyclopedia
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూ- కాశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించింది. భారతదేశం-పాకిస్తాన్ 1947లో విభజన జరిగినప్పుడు అప్పటి జమ్ము- కశ్మీర్ రాజు హరి సింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ తరువాత భారత్లో విలీనం చేసేందుకు కాశ్మీర్ రాజు అంగీకరించారు. ఆర్టికల్ 370 అంశంపై అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఐదు నెలలు చర్చ జరిపిన అనంతరం రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 370 అంశాన్ని జోడించారు. ఈ ఆర్టికల్ వల్ల భారత రాజ్యాంగం జమ్మూ కశ్మీర్కు వర్తించదు.ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ, సమాచార మినహా వేరే ఏమైనా చట్టాన్ని రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.[1][2][3][4]
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |