గోదావరి
దక్షిణ భారత దేశంలో ప్రవహించే నది / From Wikipedia, the free encyclopedia
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతం లో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు.[3] ఈ నది ఒడ్డున భద్రాచలము, రాజమహేంద్రవరం వంటి పుణ్యక్షేత్రములు, పట్టణములు ఉన్నాయి. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినులు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.
గోదావరి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం గోదావరి (అయోమయ నివృత్తి) చూడండి. |
గోదావరి గోదారి | |
---|---|
స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర,తెలంగాణ ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి (యానాం) ఒడిశా |
ప్రాంతం | దక్షిణ , పశ్చిమ భారతదేశం |
భౌతిక లక్షణాలు | |
మూలం | |
• స్థానం | త్రయంబకేశ్వర్, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర |
• అక్షాంశరేఖాంశాలు | 19°55′48″N 73°31′39″E |
• ఎత్తు | 920 m (3,020 ft) |
సముద్రాన్ని చేరే ప్రదేశం | బంగాళాఖాతం |
• స్థానం | అంతర్వేది వద్ద బంగాళాఖాతం తూర్పు గోదావరి,ఆంధ్రప్రదేశ్ |
• అక్షాంశరేఖాంశాలు | 17°0′N 81°48′E[1] |
పొడవు | 1,465 km (910 mi) |
పరీవాహక ప్రాంతం | 312,812 km2 (120,777 sq mi) |
ప్రవాహం | |
• సగటు | 3,505 m3/s (123,800 cu ft/s) |
ప్రవాహం | |
• స్థానం | పోలవరం ప్రాజెక్టు (1901–1979)[2] |
• సగటు | 3,061.18 m3/s (108,105 cu ft/s) |
• కనిష్టం | 7 m3/s (250 cu ft/s) |
• గరిష్టం | 34,606 m3/s (1,222,100 cu ft/s) |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
ఉపనదులు | |
• ఎడమ | పూర్ణా నది ప్రాణహిత ఇంద్రావతి తాలిపేరు శబరి వెయిన్ గంగా పెంగంగా వర్ధ దుధన |
• కుడి | ప్రవర మంజీరా పెద్దవాగు మన్నేరు కిన్నెరసాని |