కిన్నెరసాని
దక్షిణ భారత దేశంలో ప్రవహించే నది / From Wikipedia, the free encyclopedia
కిన్నెరసాని, గోదావరి నది యొక్క ఉపనది. కిన్నెరసాని ములుగు జిల్లాలోని మేడారం - తాడ్వాయి కొండసానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి భద్రాద్రి జిల్లాలో భద్రాచలానికి కాస్త దిగువన బూర్గంపాడు, ఏలూరు జిల్లా వేలేరు గ్రామాల మధ్యన గోదావరిలో కలుస్తుంది. 96 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ నది యొక్క ఆయకట్టు ప్రాంతం మొత్తం 1300 చదరపు కిలోమీటర్లు. కిన్నెరసాని ఉపనదైన మొర్రేడు, కొత్తగూడెం పట్టణం గుండా ప్రవహించి సంగం గ్రామం వద్ద కిన్నెరసానిలో కలుస్తుంది.[1]