తెలంగాణ రాష్ట్ర సమితి
భారతదేశంలోని రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు. ఆలె నరేంద్ర, సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు తెరాసను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు సలీమా బాషా (అస్మత్ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి | |
---|---|
నాయకత్వం | కె.చంద్రశేఖరరావు |
ప్రధాన కార్యదర్శి | కే. కేశవరావు |
స్థాపన | 2001 ఏప్రిల్ 27 |
ప్రధాన కార్యాలయం | బంజారాహిల్స్, హైదరాబాదు |
పత్రిక | నమస్తే తెలంగాణా |
సిద్ధాంతం | తెలంగాణా వాదం |
తెలంగాణా అసెంబ్లీ | 88 / 119 |
లోక్ సభ | 9 / 545 |
రాజ్య సభ | 6 / 245 |
ఓటు గుర్తు | |
కారు | |
వెబ్ సిటు | |
http://www.trspartyonline.org/ | |
జెండా | |
2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. సుదర్శన్ రావు, నాయిని నర్సింహారెడ్డి, హన్మంతరావు, గాదె ఇన్నయ్య, వి. ప్రకాశ్, నిమ్మ నర్సిం హారెడ్డి, నారాయణరెడ్డి, గొట్టె భూపతి, మందాడి సత్యనారాయణరెడ్డి, హరీశ్ రావు తదితరులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొ న్నా రు. సుమారు ఏడాదికిపైగా జలదృశ్యం లోనే టీఆర్ ఎస్ పార్టీ కార్యకలాపాలు సాగాయి. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ఈ పార్టీ ముఖ్యపాత్ర పోషించింది.
2001 మే 17న కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు బీజం వేసింది. జేఎంఎం చీఫ్, అప్పటి జార్ఖండ్ సీఎం శిబూ సోరెన్ ఈ మీటింగ్కు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. కొన్ని ఘటనల[1] తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకలాపాలు నందినగర్, హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి మారాయి. ఆరు నెలల తర్వాత ఎమ్మెల్యే కాలనీలోని మాజీ మంత్రి వేదంతరావు ఇంటికి పార్టీ కార్యాలయాన్ని మార్చారు. 2004లో వైఎస్ ప్రభుత్వం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ప్రస్తుతం తెలంగాణ భవన్ ఉన్న స్థలాన్ని టీఆర్ఎస్కు కేటాయించింది. ప్రస్తుతం క్యాంటీన్ నిర్మిస్తున్న స్థలంలో రేకుల షెడ్డు వేసి టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని ప్రారంభించారు. 2006లో తెలంగాణ భవన్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పార్టీకి 60లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు.[2][3]
2022 అక్టోబరు 5న నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానించారు.[4][5] 2022 డిసెంబరు 22న తెలంగాణ శాసనసభ, తెలంగాణ శాసనమండలిలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారుస్తూ బులెటిన్ జారీ చేసింది. టీఆర్ఎస్ఎల్పీ ఇక నుంచి బీఆర్ఎస్ఎల్పీగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది.[6]