దశనామి సాంప్రదాయం
From Wikipedia, the free encyclopedia
దశనామీ సాంప్రదాయం అనేది అద్వైత వేదాంతంలో సన్యాసి వ్యవస్థను సూచించే ఒక సాంప్రదాయం.[1] ఆది శంకరాచార్యులు సనాతన ధర్మ స్థాపనకై భారతదేశం నలువైపులా శృంగేరి, పూరీ, ద్వారక, జ్యోతిర్మఠం అనే నాలుగు ప్రదేశాల్లో నాలుగు పీఠాలు ఏర్పాటు చేశాడు. ఒక్కో పీఠానికి ఒక్కో ఆచార్యులను నియమించాడు. ఆయన శిష్య ప్రశిష్యులందరినీ దశనామీ సన్యాసుల కింద పరిగణిస్తారు. వీరి సన్యాసాశ్రమ పేరు చివరన గిరి, పురి, భారతి, ఆనంద, అరణ్య, సాగర, సరస్వతి, తీర్థ, ఆశ్రమ, పర్వత, వన అనే పేర్లు చేరుస్తారు.[2]