పాల్వాయి గోవర్ధన్ రెడ్డి
రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (20 నవంబరు 1936 - 9 జూన్ 2017)[1] తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ తరపున పలు ఎన్నికల్లో పోటీ చేశాడు.[2] పార్లమెంటు సభ్యునిగా (రాజ్యసభ) కూడా ప్రాతినిధ్యం వహించాడు.[1] 1967-72, 1972-78, 1978-83, 1983-85, 1999-2004 కాలంలో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. 2007-09 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా కూడా ఉన్నాడు.[3] భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు తరువాత, నియోజకవర్గం ...
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | |||
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | |||
రాజ్యసభ సభ్యుడు | |||
పదవీ కాలం 3 ఏప్రిల్ 2012 (2 మే 2014 నుండి తెలంగాణ రాష్ట్రం) – 9 జూన్ 2017 | |||
తరువాత | బండ ప్రకాష్, తెలంగాణ రాష్ట్ర సమితి | ||
---|---|---|---|
నియోజకవర్గం | తెలంగాణ | ||
ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 1967-72, 1972-78, 1978-83, 1983-85, 1999-2004 | |||
నియోజకవర్గం | మునుగోడు శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1936-11-20)1936 నవంబరు 20 ఇడికుడ, చండూరు మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ | ||
మరణం | 2017 జూన్ 9(2017-06-09) (వయసు 80) కులు, హిమాచల్ ప్రదేశ్ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రంగారెడ్డి - అనసూయమ్మ | ||
జీవిత భాగస్వామి | సృజమణి | ||
సంతానం | ముగ్గురు పిల్లలు (శ్రావణ్ కుమార్ రెడ్డి, పాల్వాయి స్రవంతి, డాక్టర్ శాంతన్ రెడ్డి | ||
వెబ్సైటు | www.palvai.in |
మూసివేయి