From Wikipedia, the free encyclopedia
పైడిమాంబ లేదా పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల దైవం, పూసపాటి రాజుల ఇలవేల్పు. అమ్మవారి దేవాలయం మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు. అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై 250 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. సా.శ. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ప్రస్తుత పూజారి బంటుపల్లి బైరాగి నాయుడు ఆరో తరంవాడు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆసీర్వదిస్తాడు.
పైడితల్లి అమ్మవారి ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 18.12°N 83.42°E |
పేరు | |
ప్రధాన పేరు : | పైడితల్లి అమ్మవారి ఆలయం |
దేవనాగరి : | श्री श्री श्री पैडितल्लि अम्मवारि मंदिर |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | విజయనగరం జిల్లా |
ప్రదేశం: | విజయనగరం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | పైడితల్లి |
ముఖ్య_ఉత్సవాలు: | సిరిమానోత్సవం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | 1 |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ. 1757 |
చారిత్రాత్మకంగా ఈమె పెద విజయరామరాజు చెల్లెలు. పసిప్రాయం నుండి అధ్యాత్మిక భావాలతో దేవీ ఉపాసన చేసేది. అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది. బుస్సీ కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్కచేయలేదు. 1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు. వెలమ వీరులు తమ పౌరుష ప్రతాపాల్ని ఫణంగా పెట్టి విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడారు. కానీ విజయం విజయరామరాజునే వరించింది. ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది. ఉపవాసదీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు, మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకొని బొబ్బిలి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. తన ప్రతిమ పెద్దచెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయ్యింది.
అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవానికి చాలా ప్రాముఖ్యముంది. సిరిమాను అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం[1]
అమ్మవారి జాతరలో సిరిమాను సంబరం కీలకమైన ఘట్టం. సిరిమానోత్సవం ఆద్యంతం వీనుల విందుగా సాగుతుంది. ఈ సిరిమాను ఉత్సవానికి అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. పేరుకి గ్రామ దేవతే అయినా ఆ తల్లి కీర్తి మండలాలు, పట్టణాలు జిల్లాలు దాటి విశ్వవ్యాప్తమైంది. విజయనగరం, పైడితల్లి మహిమ గురించి ఎక్కడెక్కడ వాళ్లో తెలుసుకుని మరీ సిరిమాను సంబరం రోజున వ్యయప్రయాసల కోర్చి మరీ వస్తుంటుంటారు. ఆశేషమైన భక్తులను విశేషంగా ఆకట్టుకునే సిరిమాను ఉత్సవంలో మొదటి నుంచి చివరి వరకూ అన్నీ రసవత్తరమైన సన్నివేశాలే. సిరిమాను రథం ఊరేగింపులో ఎనిమిది ప్రధానమైన అంశాలుంటాయి. అన్నింటిలో కీలకమైందీ, విశేషమైందీ సిరిమాను సంబరం, సిరిమాను ఉపరితలంపై బిగించే ఇరుసు, దానిపై ప్రధాన పూజారి ఆసనం, అతని చేతిలో విసనకర్ర ప్రత్యేక ఆకర్షణలు, సిరిమాను తిరుగుతున్నంత సేపూ భక్తులు అరటిపళ్లు విసరడం ఆనవాయితీగా వస్తోంది. 33 మూరలు ఉండే సిరిమాను కోసం అంతటి మాను లభించడమే విశేషం. తల్లి మహిమను అదే పెద్ద తార్కాణం చూడముచ్చటగా, అత్యంత శోభాయమానంగా సువర్ణ వర్ణంతో కళకళలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ అయితే సిరిమాను ముందు సాగే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం చేసేందుకు జనం ఎగబడుతుంటారు.
పైడితల్లి అమ్మ చరిత్రలో జాలర్లకు విశేషమైన స్థానం ఉంది. లోక పావని, కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అలరారుతున్న పైడితల్లి దర్శన భాగ్యాన్ని మనకు కలిగించడంలో జాలర్లకు కీలక పాత్రం పోషంచారు. రెండున్నర శతాబ్ధాలకు మునుపు అమ్మతల్లి పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమై ఉన్నప్పడు ఆ తల్లి మూల విరాట్టును బయటకు తీయడంలో స్థానిక యూత వీధికి చెందిన జాలర్ల కృషి అమోఘం. అమ్మను మొదటిసారి చూసే భాగ్యం బెస్తవారికే దక్కింది. అమ్మవారి సేవపూర్వ జన్మసుకృతంగా భావించిన జాలర్లు ప్రధాన పూజారి అప్పలనాయుడిని ఒక కోరిక అడిగారని చరిత్ర చెబుతోంది. ప్రతీ ఏటా జరిగే సిరిమాను సంబరంలో అమ్మవారి సిరిమానుశ్రీన ముందు తమకు చోటు కల్పించాలనే జాలర్ల కోరికను అప్పలనాయుడు మన్నించాడు. ఈ కారణంగానే ఆనాటి నుంచి సిరిమాను సంబరంలో బెస్తవారి వలతో జాలర్లు ఉండటం ఆనవాయితీగా వస్తోంది.
జాలరి వల వెనుక ఈటెలతో వచ్చే జనం సాధారణ జనం కాదు. వీరిని పూర్వీకులు మహాశక్తి స్వరూపులుగా పరిగణించారు. పాలధారంగా పిలిచే ఈ జనధార అమ్మవారి సైనిక శక్తిగా ప్రతిరూపంగా చెబుతుంటారు. వీరి చరిత్ర కూడా ఘనమైనదే. పూర్వం కోట వెనుక అడవిలో నివసించే ఆటవికులు కోటరక్షణగా ఉండేవారని కథనం. వారికి గుర్తుగానే సిరిమాను ఉత్సవంలో ఈటెలు ధరించి డప్పులు వాయిస్తూ సిరిమాను ఊరేగింపులో పాల్గొంటారు. వీరిని అమ్మవారి శక్తికి ప్రతిరూపాలుగా భక్తులు విశ్వసిస్తారు.
సిరిమాను జాతరలో తెల్ల ఏనుగు మరో విశిష్టమైన ఆకర్షణ, గజపతులు వారి ప్రాభవాన్ని ప్రతిబింబించే విధంగా పట్టపుటేనుగును అమ్మవారి సిరిమాను సంబరంలో ఉంచేవారు. అయితే కాలక్రమేణా సంస్థానాలు, రాజ్యలు పోవడంతో 1956వ సంవత్సరం నుంచి పట్టపుటేనుగును ప్రతిబింబించే విధంగా ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సిరిమాను ముందు నడిపిస్తున్నారు. ఈ బండి మీద ఏడుగురు స్త్రీ వేషధారులు, ఒక పురుషుడు ఉంటారు. ఈ ఏడుగురు స్త్రీలు పైడితల్లి అక్కచెల్లెళ్లు కాగా పరుషుడు అమ్మవారి ఏకైక సోదరుడు పోతురాజుగా చెబుతుంటారు. అపురూప దేవతలందర్నీ ఒకే వేదికపై మనకు సాక్షాత్కరింపే చేసే ఆ ఏనుగు నిజంగా ఐరావతమే.
సిరిమాను సంబరంలో చివరిదైన చిత్రమైన అంశం అంజలి రథం. అమ్మవారి వైభోగానికి ఈ అంజలి రథం ప్రత్యేక నిదర్శనం. ఏలికా, పరిచారికమధ్య, అనుబంధానికి ఈ అంజలి రథం ప్రతీకగా నిలుస్తుంది. అంజలి రథంపై ఉండే ఐదుగురు స్త్రీలు అమ్మవారిని సేవించి ధరించిన పరిచారికలు. నాడు తల్లిపై వాళ్లు చూపించిన భక్తి ప్రవక్తులను నేటికీ గుర్తుకు తెచ్చేలా అంజలి రథంపై స్త్రీ వేషదారులు సిరిమాను ముందు అంజలి ఘటించి కనిపిస్తారు. తరతరాల సేవా నిరతికి భక్తి విశ్వాసాలకు మారుపేరే అంజలి రథం. బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ముందు నడవగా వేషదారులు భక్తి పారవశ్యంతో కదంతొక్కి పరిగెడుతుండగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి వైభవాన్ని తనివితీరా చూసి భక్తి భావంతో మమేకమవుతుంటారు. అమ్మవారు తన గుడి నుంచి బయటకు వచ్చి ముక్తమనోహరంగా అలంకరించిన సిరిమానుపై పూజారి వేశంలో ఆశీనులై ఊరేగుతారు.
ఈ సిరిమానే నిదర్శనం సిరిమాను కోసం 33 మూరలు ఉండే వృక్షాన్ని కనిపెట్టడం సామాన్యులకు సాధ్యమయ్యే అంశం కాదు. ప్రతీ ఏటా సిరిమాను సంబరానికి సరిపడే వృక్షం లభించడం కూడా ఒక అద్భుతమైన ఘట్టం.2021 లో సిరిమానును డెంకాడ మండలం, డెంకాడ పంచాయితి పరిదిలోని దొడ్డిబాడువ గ్రామం నుంచి తీసుకు వచ్చారు .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.