ప్రజాశక్తి
From Wikipedia, the free encyclopedia
ప్రజాశక్తి హైదరాబాదులోని ప్రజాశక్తి సాహితీ సంస్థచే ప్రచురించబడుతున్న తెలుగు దినపత్రిక. ఇది స్వాతంత్ర్యోద్యమ కాలములో 1942లో మద్రాసులో కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికగా ఆవిర్భవించింది.[1] 1945 నుండి ఈ పత్రిక విజయవాడనుండి ప్రతిదినము ప్రచురించడం ప్రారంభమయ్యింది. అనతికాలములోనే బ్రిటీషు ప్రభుత్వ ఆగ్రహానికి గురై 1948లో నిషేధించబడింది. 1969లో వారపత్రికగా తిరిగి ప్రారంభమైనది. 1981లో దినపత్రికగా మారి 2014వ సంవత్సరము వరకు 10 సంచికలకు ఎదిగినది. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిన తరువాత మార్కిస్టు -లెనినిస్టు భావజాల సమూహానికి పత్రికగా కొనసాగుతున్నది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ప్రజాశక్తి ఆంధ్ర ప్రాంతానికి పరిమతమైనది, తెలంగాణ లో మార్చి 25, 2015 నుండి నవతెలంగాణ పేరుతో వస్తున్నది.
త్వరిత వాస్తవాలు రకం, రూపం తీరు ...
రకం | ప్రతి దినం దిన పత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం | ప్రజాశక్తి సాహితీ సంస్థ |
సంపాదకులు | ఎం వి ఎస్ శర్మ |
స్థాపించినది | 1942-06-13 (వారపత్రిక),మద్రాసు, 1945-12-03 (దినపత్రిక)విజయవాడ, 1951-11-21 (వారపత్రిక), 1981-08-XX (దినపత్రిక) |
రాజకీయత మొగ్గు | కమ్యూనిజం |
ముద్రణ నిలిపివేసినది | 1948-04-22 నుండి 1951-11-20 (వారపత్రిక) మరల ఇంకొన్నాళ్లు |
కేంద్రం | విజయవాడ |
జాలస్థలి | ప్రజాశక్తి అధికారిక వెబ్సైటు |
మూసివేయి