మదన్ మోహన్ మాలవ్యా
భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త. / From Wikipedia, the free encyclopedia
మదన్ మోహన్ మాలవ్యాా (డిసెంబర్ 25, 1861 - నవంబరు 12, 1946) భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు.[1] ఆయన "మహాత్మా"గా కూడా గౌవరింపబడ్డాడు.[2] మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం , ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం.[3] ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ , టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.[4][5]
పండిట్ మదన్ మోహన్ మాలవ్యా | |||
Portrait of Madan Mohan Malviya unveiled by Dr. Rajendra Prasad on 19 December 1957. | |||
President of the Indian National Congress | |||
పదవీ కాలం 1909–10; 1918–19; 1932 and 1933 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | (1861-12-25)1861 డిసెంబరు 25 అలహాబాదు, భారతదేశం | ||
మరణం | 1946 నవంబరు 12(1946-11-12) (వయసు 84) బనారస్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
పూర్వ విద్యార్థి | Allahabad University University of Calcutta | ||
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు,విద్యావేత్త, రాజకీయ నాయకుడు
అవార్డులు: భారతరత్న 2015 | ||
మతం | హిందూ |
మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా rendu సార్లు (1909 & 1918) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ , గైడ్సు"కు ఒక వ్యవస్థాపకుడు.[6] ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక లీడర్ పత్రికను స్థాపించారు.[7] ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.[7]
మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన భారతరత్నకు డిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు.[8]