మదురై
దక్షిణ భారతదేశంలో తమిళనాడు నగరం / From Wikipedia, the free encyclopedia
మదురై, దక్షిణ తమిళనాడులోని నగరం. అదే పేరుగల జిల్లాకు కేంద్రం. మదురై హిందూ ఆధ్యాత్మిక కేంద్రం. ఇది వైగై నదీ తీరాన ఉంది. తమిళనాడులో మదురై (మదురై మెట్రోపాలిటన్ ప్రాంతం) పెద్దనగరాలలో మూడవ శ్రేణిలో ఉంది.2001 జనాభా గణాంకాలను ప్రకారం మదురై నగర జనాభా 12,00,000.
Madurai(మదురై)
மதுரை Athens of The East | |
---|---|
City | |
Country | India |
State | Tamil Nadu |
District | Madurai district |
Government | |
• Type | Mayor-Council |
• Body | Madurai City Municipal Corporation |
• Mayor | Position vacant[1] |
• Commissioner of Corporation | Sandeep Nanduri IAS |
• Commissioner of Police | Shailesh Kumar Yadav IPS |
విస్తీర్ణం | |
• City | 242.977 కి.మీ2 (93.814 చ. మై) |
Elevation | 101 మీ (331 అ.) |
జనాభా (2011) | |
• City | 14,65,625[2] |
• Rank | 3 |
• జనసాంద్రత | 6,425/కి.మీ2 (16,640/చ. మై.) |
• Metro | 14,65,625[2] |
Demonym(s) | Maduraite, Maduraikaran |
Language | |
• అధికార | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 625 xxx |
టెలిఫోన్ కోడ్ | 0452 |
Vehicle registration | TN-58 (South), TN-59 (North) and TN-64(Central) |
మదురై ప్రపంచంలోని పురాతనకాల నివాస నగరాలలో ఒకటి. మదురై నగరం మదురై జిల్లా కేంద్రంలో పాండ్యులు ముందుగా కొర్కైని రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత పాండ్యులు నెడుంజళియన్ కాలంలో కూడల్ నగరానికి వారి రాజధానిని మార్చుకున్నారు. ఆ నగరమే ప్రస్తుత రాజధాని. మదుర నాయక మహారాజు చేత నిర్మించబడిన మీనాక్షీ కోవెలకు మదురై ప్రసిద్ధి చెంది ఉంది. ద్రవిడ సంప్రదాయాన్ని ప్రతిబింబింస్తున్న మదురై మీనాక్షీ ఆలయం భారతీయ పుణ్యక్షేత్రాలలో ఒకటి. మదురకు కూడలి నగరం, మల్లెల నగరం, ఆలయనగరం, నిద్రించని నగరం, నాలుగు కూడలుల నగరంగా ప్రసిద్ధి కలిగి ఉంది.
భారతదేశంలో పర్యటించిన గ్రీకు దూత మెగస్తనీస్ 3వ శతాబ్దంలో మదురై నగరాన్ని గురించి ప్రస్తావించాడు. మౌర్య చక్రవర్తి ప్రధాన మంత్రి కౌటిల్యుడు ఈ నగర ప్రస్తావన చేసాడు. సా. శ 14వ శతాబ్దం ఆరంభంలో తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాలను పాలించిన పాండ్యరాజుల ఆదర్శపాలన, సాంస్కృతిక కేంద్రంగా మదురై విలసిల్లింది. 1311లో పాండ్య సింహాసనం ఢిల్లీ నవాబుల చేతిలో పతనం చేయబడింది. బాబర్ రాజ్యంలోకి చేరిన ఈ నగరం తరువాత బాబర్ సమ్రాజ్యం పతనావస్థకు చేరిన తరువాత 14వ శతాబ్దంలో స్వతంత్రం పొంది విజయనగర సామ్రాజ్యంలో భాగం అయింది. విజయనగర రాజప్రతినిధులు మదురై నాయక్ రాజుల ఆధ్వర్యంలో ఈ నగరం అభివృద్ధి చేయబడి తరువాత 1559 నుండి 1736 వరకు స్వతంత్రంగా ఉంది. కొంతకాలం కర్నాటక రాజులైన చందాసాహెబ్ ఆధ్వర్యంలో ఉన్న మదురై 1801 నాటికి ఈస్టిండియా కంపెనీ అధికారంలోకి వచ్చింది.