లాల్ కృష్ణ అద్వానీ
భారతదేశపు ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకడైన లాల్ కృష్ణ అద్వానీ . 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవ / From Wikipedia, the free encyclopedia
భారతదేశ రాజకీయల్లో "లోహ పురుషుడు" గా ప్రసిద్ధి గాంచిన లాల్ కృష్ణ ఆడ్వాణీ గారు 1927 జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచి పట్టణంలోని సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యా. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందినాడు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవి పొందినాడు. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు. 2009 ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటింబడ్డాడు. ప్రస్తుతం 15వ లోక్సభ ఎన్నికలలో గుజరాత్ లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి[1] విజయం సాధించాడు.
లాల్ కృష్ణ ఆడ్వాణీ | |||
నియోజకవర్గం | గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1927-11-08) 1927 నవంబరు 8 (వయసు 96) కరాచి | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | కమల అద్వానీ
(m. 1965; died 2016) | ||
సంతానం | ప్రతిభా అద్వానీ (కూతురు) జయంత్ అద్వానీ (కుమారుడు) | ||
నివాసం | ఢిల్లీ | ||
పురస్కారాలు | భారతరత్న పద్మ విభూషణ్ | ||
జూన్ 6, 2008నాటికి |
ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న 2024 ఫిబ్రవరి 3న ప్రకటించింది.[2] రాష్ట్రపతి భవన్లో మార్చి 30న జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి వయోభారం, అనారోగ్యం కారణంగా ఆయన హాజరుకాలేకపోవడంతో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మార్చి 31న స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లి ఈ అవార్డును అందజేసింది.[3]