విజయనగరం జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
విజయనగరం జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. జిల్లా కేంద్రం విజయనగరం. 2022 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, విజయనగరం లోక్సభ నియోజకవర్గ పరిధి ప్రాతిపదికగా జిల్లా చేయుటకు, పార్వతీపురం రెవెన్యూ డివిజనులోని 11 మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో చేర్చి, శ్రీకాకుళం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజనులోని 4 మండలాలు జిల్లాలో కలిపారు.
విజయనగరం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం విజయనగరం (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు విజయనగరం జిల్లా, దేశం ...
విజయనగరం జిల్లా | |
---|---|
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | ఉత్తరాంధ్ర |
ప్రధాన కార్యాలయం | విజయనగరం |
Area | |
• Total | 4,122 km2 (1,592 sq mi) |
Population (2011)[1] | |
• Total | 19,30,800 |
• Density | 470/km2 (1,200/sq mi) |
భాషలు | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0 |
మూసివేయి
బొబ్బిలి కోట, విజయనగరం కోట, విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఆలయం జామి వృక్షం,రామతీర్థంలో ప్రాచీన శ్రీరామ దేవాలయం, బౌద్ధక్షేత్రం అవశేషాలు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.