విశాలాంధ్ర దినపత్రిక
From Wikipedia, the free encyclopedia
విశాలాంధ్ర సహకారం రంగంలో నిర్వహించబడుతున్న తెలుగు దినపత్రిక.[1] ఇది జూన్ 22 తేదీన, 1952 సంవత్సరం విజయవాడలో ప్రారంభమైనది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదం వ్యాప్తి చేయటానికి ప్రజాశక్తి దినపత్రికను విశాలాంధ్రగా మార్చాలని 1952 లో రాష్ట్ర కమ్యూనిష్టు పార్టీ తీర్మానం చేసింది. తొలి సంపాదకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు. తెలుగు ప్రజలందరు ఏకమై ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పేరు సూచించిది ఈ పత్రికే.[ఆధారం చూపాలి] 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమాలకు వ్యతిరేకంగా కీలకపాత్ర పోషించింది.[2]. 2014లో ఏడు కేంద్రాలనుండి ప్రచురించబడుతున్నది. 2012 సంవత్సరంలో వజ్రోత్సవాలు జరిగాయి.
త్వరిత వాస్తవాలు రకం, రూపం తీరు ...
రకం | ప్రతి దినం దిన పత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం | విశాలాంధ్ర విజ్ఞాన సమితి |
ప్రచురణకర్త | విశాలాంధ్ర విజ్ఞాన సమితి |
సంపాదకులు | కే.శ్రీనివాస్ రెడ్డి |
స్థాపించినది | 1952-06-22, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ |
రాజకీయత మొగ్గు | కమ్యూనిజం |
కేంద్రం | విజయవాడ |
జాలస్థలి | https://visalaandhra.com/ |
మూసివేయి