విష్ణు సహస్రనామ స్తోత్రము
శ్రీ విష్ణు 1000 పేర్లతో పిలువబడే శ్లోకం / From Wikipedia, the free encyclopedia
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక vedic ప్రార్థనలలో ఒకటి. సహస్ర అనగా వెయ్యి . అంటే ఈ స్తోత్రంలో వెయ్యి నామాలు ఉంటాయి . ఇది శ్రీమహావిష్ణువు యొక్క వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు (చాత్తాద శ్రీవైష్ణవులు) భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.ఇచట సహస్రనామము అనగా వేయి పేర్లు అని కాదు అనంతము అని చెప్పుకోవలెను.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. (July 2021) |
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
మొదటిగా విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు (ధర్మరాజుకు) ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ప్రతీతి. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడింది.
రెండవది గరుడపురాణములో విష్ణు సహస్రనామ స్తోత్రము ఉంది. మూడవది పద్మపురాణములో కూడా దీని ప్రస్తావన ఉంది.ఈ మూడింటినే వ్యాసుడే రచించాడు అని కొందరు భక్తుల అభిమతము.గరుడపురాణములోని సహస్రనామ స్తోత్రమును శ్రీహరి రుద్రునకు, పద్మపురాణములోని స్తోత్రమును మహాదేవుడు తన సతి పార్వతికి ఉపదేశించాడు.కాని ఈ మూడింటిలో అతి ప్రాచీనమై, ప్రసిద్ధమై శ్రీ శంకర భగవత్పాదుల, పరాశర భట్టాదులచేత వ్యాఖ్యానింపబడి బాలురు, వృద్ధులు, స్త్రీలు మిగతావారిచే పారాయణగావించబడుచున్నది భారతాంర్గతమైన స్తోత్రము. అందువలన మిగతా రెండింటి ఉనికియే చాలా మందికి తెలీదు. వాటికి వ్యాఖ్యానములు కూడా లభించుటలేదు. ఈస్తోత్ర మహిమను సా.శ.6-7 శతాబ్దములకు చెందిన భాణభట్టు తన కాదంబరిలో విలాసవతి అను రాణికి జన్మించిన బాలకుని రక్షణకొరకు సూతికాగృహ సమీపములో విప్రవర్యులు నామ సహస్రమును పఠించుచుండిరని నుడువుటచే దీని ప్రాశస్త్యము మనవరికి చాలా కాలమునకు ముందుగానే అవగతమైనట్లు తెలియుచున్నది. అటులనే దీని మహిమ ఆయుర్వేద గ్రంథములలోను, జ్యోతిష్య శాస్త్రములలోను, ఉన్నాత్లు కూడా ఆధారములు ఉన్నాయి.
శ్రీ శంకరులు గేయం గీతానామ సహస్రం అని తమ మొహముద్గర స్తోత్రములో నుడువుటచే భగవద్గీతకు, నామ సహస్రమునకు కల సమప్రాధాన్యము, అన్యోన్య సాపేక్షత ఊహించవచ్చును. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రమునకు శ్రీ శంకర భాష్యముతో పాటు, బృహత భాష్యము, విష్ణు వల్లభ భాష్యము, ఆనందతీర్ధ-కృష్ణానందతీర్ధ-గంగాధర యోగీంద్ర-పరాశరభట్ట-మహాదేవ వేదాంతి-రంగనాధాచార్య-రామానందతీర్ధ-శ్రీరామానుజ-విద్యారణ్యతీర్ధ-బ్రహ్మానందతీర్ధ భారతి-సుదర్శన-గోవిందభట్టుల భాష్యములు (వ్యాఖ్యానములు) పదిహేను ఉన్నాయి.ఇప్పుడు మనకు లభిస్తున్న వాటిలో శ్రీశంకరులదే ప్రాచీనము అని చెప్పవచ్చును.1901లో దీనిని ఆర్.అనంతకృష్ణ శాస్త్రిగారు తొలిసారి ఆంగ్లములోనికి అనువాదించిరి.