వైదిక నాగరికత
వేద సంస్కృతి / From Wikipedia, the free encyclopedia
వేద నాగరికత లేదా వేద కాలం అనేది సుమారు క్రీస్తు పూర్వం 2000 - 1000 గల మధ్యకాలం. ఈ కాలంలోనే చతుర్వేదాలలో పురాతమైన ఋగ్వేదం ఆవిర్భవించింది అని చెప్పబడుతుంది.ఋగ్వేదం ప్రకారము శబ్దపరంగా ఆర్యన్ అంటే ఉత్తమ జన్మ అని అర్దం. ఋగ్వేదంలో ఆర్యుల ప్రస్తావన కలదు కనుక ఆర్యుల మధ్య ఆసియాకు చెందిన వారని మాక్స్ ముల్లర్ అభిప్రాయపడ్డారు కాని ఈ సిద్దాంతాన్ని చాలా మంది వ్యతిరేకించారు. [note 1]భారత దేశ సాహిత్యానికి ప్రధాన ఆధారం వేదసాహిత్యం. ఈ వేద సాహిత్యం నుంచే మిగతా సాహిత్యం పుట్టింది. నాలుగు వేదాలు, వాటి అనుబంధాలు సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉపవేదాలైన ఆయుర్వేదం, ధను, గాంధార, శిల్పవేదాలు, వేదాంగాలు, షడ్దర్శనాలు, ఇతిహాసాలు అలాగే రుగ్వేద, మలివేద కాలంలో సాంఘిక వ్యవస్థ ప్రధానమైనది. రుగ్వేదంలోని 10వ మండలం పురుషసూక్తంలో వర్ణవ్యవస్థ గురించి మొదటిసారిగా పేర్కొనబడింది. అధర్వణ వేదంలో గోత్ర వ్యవస్థ గురించి పేర్కొనగా అది తర్వాత కాలంలో కుల వ్యవస్థకు రూపకల్పన అయింది. యజ్ఞయగాది క్రతువుల నిర్వహణ, సంగీతానికి ఆధార గ్రంథాలు కూడా ఈ వేదాలే. ఇక్కడ రాజకీయ వేద నాగరికత కాకుండా సాహిత్యం, వేదకాలంలో మహిళ పరిస్థితి అంశాలకు ప్రాధాన్యం ఉంది. ఉదా: రుగ్వేద కాలంలో మహిళకు పురుషునితోపాటు సమాన హోదా ఇవ్వగా మలివేదకాలంలో స్త్రీ పరిస్థితి దిగజారింది. అపాల, విశ్వవర, గార్గి, మైత్రేయి వంటి స్త్రీల గురించి, మత విధానం గురించి ఉంది.
ఉత్తర భారత ఉపఖండ చరిత్రలో పట్టణ సింధు లోయ నాగరికత ముగింపు (సిర్కా 1500 - క్రీ.పూ 500), నుండి ఇండో-గంగా మైదానంలో ప్రారంభమైన రెండవ పట్టణీకరణ సిర్కా 600 -క్రీ.పూ. 200 మద్యకాలం వేద కాలం లేదా వేద యుగంగా భావించబడుతుంది. దీనికి వేదాల నుండి స్వీకరించిన పేరు నిర్ణయించబడింది. ఈ కాలంలో జీవించిన ప్రజల జీవనవిధానం వివరించే మౌఖికసాహిత్య ఆధారిత మానవపరిణామచరిత్రగా దీనిని భావించవచ్చు.[2] ఈ కాలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాథమిక వనరులుగా ఇవి సహకరిస్తున్నాయి. ఈ పత్రాలు సంబంధిత పురావస్తు రికార్డులతో పాటు వేద సంస్కృతి పరిణామాన్ని గుర్తించడానికి సాక్ష్యాధారాలుగా ఇవి అనుమతించబడతాయి.
ఈ కాలం ప్రారంభంలో భారత ఉపఖండంలోని వాయవ్య ప్రాంతాలకు వలస వచ్చిన పాత ఇండో-ఆర్యను భాష మాట్లాడేవారు వేదాలను స్వరబద్ధం చేసి మౌఖికంగా ప్రసారం చేశారు. వేద సమాజం పితృస్వామ్య సమాజంగా ఉండేది. ప్రారంభ వేద ఆర్యులు పంజాబులో కేంద్రీకృతమై ఉన్న ఒక చివరి కాంస్య యుగం సమాజం, రాజ్యాలుగా కాకుండా తెగలుగా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రధానంగా మతసంబంధమైన జీవన విధానం కొనసాగించబడ్డారు. సి. క్రీస్తుపూర్వం 1200–1000 వరకు వేద ఆర్యులు సారవంతమైన పశ్చిమ గంగా మైదానానికి తూర్పు వైపు వ్యాపించి ఇనుప ఉపకరణాలను తయారీని అవలంబించారు. ఇవి అడవిని తొలగించి వ్యవసాయం చేయడానికి, మరింత స్థిర జీవన విధానాన్ని అవలంబించడానికి అనుమతించాయి. వేద కాలం రెండవ భాగంలో పట్టణాలు, రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈకాలం భారతదేశానికి విలక్షణమైన సంక్లిష్టమైన సామాజిక భేదంన్ని ప్రత్యేత ఇచ్చింది.[3] కురు రాజ్యం సనాతన బలి కర్మ క్రోడీకరణ ద్వారా ఇది వర్గీకరించబడింది.[4][5] ఈ సమయంలో మధ్య గంగా మైదానంలో వేదేతర ఇండో-ఆర్య సంస్కృతి ఆధిపత్యం చెలాయించింది. వేద కాలం ముగిసినప్పుడు నిజమైన నగరాలు, పెద్ద రాష్ట్రాలు (మహాజనపదాలు అని పిలుస్తారు) అలాగే వేద సనాతన ధర్మాన్ని సవాలు చేసే అరామ ఉద్యమాలు (జైన మతం! బౌద్ధమతంతో సహా) అధికరించాయి.[6] వేద కాలంలో సాంఘిక తరగతుల సోపానక్రమం ఉద్భవించింది. అది ప్రభావవంతంగా ఉంటుంది. వేద మతం బ్రాహ్మణ సనాతన ధర్మంగా అభివృద్ధి చెందింది. సాధారణ యుగం ప్రారంభంలో వేద సంప్రదాయం "హిందూ సంశ్లేషణ" అని పిలవబడే ప్రధాన భాగాలలో ఒకటిగా ఏర్పడింది.
వేద భౌతిక సంస్కృతి దశలతో గుర్తించబడిన పురావస్తు సంస్కృతులలో ఓచరు కలర్డు పాటరీ కల్చరు గాంధార సమాధి సంస్కృతి, నలుపు, ఎరుపు మిశ్రితవర్ణ పాత్రల వాడకం, పెయింటెడ్ గ్రే వేర్ సంస్కృతి ఉన్నాయి.[7] [8]