వేమన
సుప్రసిద్ధ తెలుగు కవి / From Wikipedia, the free encyclopedia
వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగు వారికి సుపరిచితాలు. వేమన సుమారు 1367 - 1478 మధ్య కాలములో జీవించాడు. వేమన ఏ కులానికి చెందినవాడు అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. CP బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించాడు. ఆటవెలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చాడు.
త్వరిత వాస్తవాలు యోగి వేమన, పుట్టిన తేదీ, స్థలం ...
యోగి వేమన | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | సా.శ1367(?) కొండవీడు, ప్రస్తుత గుంటూరు జిల్లా [1] |
మరణం | రెడ్డి శకం 1478 కటారు పల్లె గ్రామం |
వృత్తి | కవి, సంఘసంస్కర్త |
సంతకం |
మూసివేయి