హాథీగుంఫా శాసనం
క్రీ.పూ రెండవ శతాబ్దానికి చెందిన శాసనం. ప్రస్తుతం ఒడిషాలో ఉంది. / From Wikipedia, the free encyclopedia
హాథీగుంఫా శాసనం క్రీ. పూ 2వ శతాబ్దంలో ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ సమీపంలో ఉదయగిరి గుహలలో అప్పటి కళింగ పాలకుడు ఖారవేలుడు చెక్కించిన శిలాశాసనం.[1] ఇది ఉదయగిరి కొండల్లో దక్షిణం వైపున ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ హాథీగుంఫా అనే గుహలో రాతిపై ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో 17 వరుసల్లో చెక్కబడి ఉంది.