వీరేంద్ర సెహ్వాగ్
భారత క్రికెటర్ From Wikipedia, the free encyclopedia
Remove ads
వీరేంద్ర సెహ్వాగ్ (జ.1978 అక్టోబరు 20) భారత క్రికెట్ ఆటగాడు. అతడిని వీరూ అని కూడా పిలుస్తారు. 1999 నుంచి వన్డే పోటీల్లోను, 2001 నుంచి టెస్టుల లోనూ భారత జట్టు తరపున ఆడుతున్నాడు. కుడిచేతి వాటం గల ఈ బ్యాట్స్మెన్, బౌలింగ్ కూడా చేయగలడు. సెహ్వాగ్, భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (319) సాధించిన బ్యాట్స్మన్. 2005 అక్టోబరులో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇతను ఉప సారథిగా నియమితుడయ్యాడు. 2006 డిసెంబరులో అతడిని తొలగించి వి.వి.యెస్.లక్ష్మణ్ ను నియమించారు. 2007 జనవరిలో భాతర వన్డే జట్టు నుంచి ఇతని పేరు తొలిగించారు.[1] 2007-08 ఆస్ట్రేలియా పర్యటనకై మళ్ళీ ఎంపికై అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్నింగ్సులో శతకాన్ని నమోదుచేసాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికా జట్టుపై చెన్నైలోని చేపాక్ స్టేడియంలో మరో ట్రిపుల్ సెంచరీని సాధించి రెండు ట్రిపుల్ఈ సెంచరీలు చేసిన ఘనత సాధించిన మూడో బ్యాట్స్మెన్గా అవతరించాడు. డాన్ బ్రాడ్మెన్, బ్రియాన్ లారాలు మాత్రమే ఇది వరకు రెండేసి ట్రిపుల్ సెంచరీలు నమోదు చేశారు.
Remove ads
క్రీడా జీవితం
1999 ఏప్రిల్లో పాకిస్తాన్ పై వన్డే క్రికెట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్ తొలిరోజుల్లో ఆశించినంతగా రాణించలేదు. తొలి వన్డేలో ఒక్క పరుగుకే ఔట్ అయి, బౌలింగ్లో కూడా 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చేశాడు.[2] 2000 డిసెంబర్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సెహ్వాగ్కు మరో అవకాశం లభించింది. కాని 2001 మార్చిలో ఆడిన తన నాలుగవ మ్యాచ్ వరకు తన ప్రతిభను చూపలేక పోయాడు. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై బెంగుళూరులో 54 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. 3 వికెట్లకు పాట్నర్షిప్ పరుగులు సాధించి భారత విజయానికి దోహదపడి తొలి సారిగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.[3] ఆ తరువాత జరిగిన జింబాబ్వే పర్యటనలో అంతగా రాణించలేదు. 2001 ఆగస్టులో శ్రీలంక, న్యూజీలాండ్లతో జరిగిన ముక్కోణపు పోటీలలో సచిన్ టెండుల్కర్ గాయపడడంతో అతడి స్థానంలో సెహ్వాగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఆడాడు..[4] అదే సీరీస్లో న్యూజీలాండ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 69 బంతులోనే సెంచరీ సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు. అదే అతని తొలి వన్డే సెంచరీ కావడం గమనార్హం.[5] అప్పటికి ఆ సెంచరీ భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీగా నమోదైంది. ఆ మ్యాచ్లో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆ తరువాత భారత జట్టులో రెగ్యులర్ బ్యాట్స్మెన్గా చెలామణి అయ్యాడు.
2002లో కెన్యాతో జరిగిన మ్యాచ్లో కేవలం 22 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించి భారత్ తరఫున రెండో వేగవంతమైన అర్థసెంచరీ సాధించిన బ్యాట్స్మెన్గా అవతరించాడు. 2002 జనవరిలో సౌరవ్ గంగూలీ గాయపడడంతో ఇంగ్లాండ్తో కాన్పూర్లో జరిగిన మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రంగప్రవేశం చేసి 64 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.[6] అప్పటి నుంచి సచిన్ టెండుల్కర్ను మిడిల్ ఆర్డర్ పంపించి సెహ్వాగ్చే ఓపెనింగ్ బ్యాటింగ్ చేయించారు.[7] ఆ తరువాత ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సీరీస్ లలో చెలరేగి ఆడి 4 అర్థ సెంచరీలతో 42.6 సగటుతో 426 పరుగులు సాధించాడు. 2002లో శ్రీలంకలో జరిగిన ఐ.సి.సి.చాంపియన్ ట్రోఫీలో 90.33 సగటుతో 271 పరుగులు సాధించాడు. అందులో రెండు పర్యాయాలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందినాడు. ఆ సీరీస్లో గంగూలీతో జతగా సాధించిన 192 పార్ట్నర్షిప్ సెంచరీ, వ్యక్తిగతంగా 104 బంతులలో సాధించిన 126 పరుగులు కూడా ఉన్నాయి. ఆ మ్యాచ్లో భారత్ 8 వికెట్లతో నెగ్గింది.[8] ఆ తరువాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 54 బంతుల్లో 58 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్లో కూడా రాణించి 25 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి భారత్కు 10 పరుగుల విజయాన్ని అందించి భారత్ ఫైనల్లోకి ప్రవేశించడానికి దోహదపడ్డాడు.[9]
2002 చివరిలో రాజ్కోట్లో వెస్ట్ఇండీస్తో జరిగిన మ్యాచ్లో 82 బంతుల్లో 114 పరుగులు సాధించడమే కాకుండా గంగూలీతో కలిసి 196 పరుగుల భాగస్వామ్య పరుగులు జతచేసి ఆ మ్యాచ్లో భారత్కు 9 వికెట్లతో విజయాన్నిఅందించాడు.[10] న్యూజీలాండ్తో జరిగిన 7 మ్యాచ్ల సీరీస్లో సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్మెన్గా సెహ్వాగ్ అవతరించాడు. అందులో మొదటిది నేపియర్లో 108 పరుగులతో సెంచరీ చేయగా [11] రెండో సారి ఆక్లాండ్లో 112 పరుగులు సాధించాడు.[12]
2003లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్లో సెహ్వాగ్ 27 సగటుతో 299 పరుగులు సాధించాడు. అందులో అత్యధిక స్కోరు ఫైనల్లో ఆస్ట్రేలియాపై సాధించిన 82 పరుగులు.[13] ప్రపంచ కప్ తరువాత హైదరాబాదులో న్యూజీలాండ్తో జరిగిన మ్యాచ్లో 130 పరుగులు చేయడమే కాకుండా సచిన్ టెండుల్కర్తో జతగా 182 పరుగుల భాగస్వామ్యం జతచేసి భారత్ 145 పరుగులతో విజయం సాధించడానికి పునాది వేశాడు. ఇది అతనికి నాలుగవ సెంచరీ కాగా ఆ మ్యాచ్లో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.[14] ఆ తరువాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో జరిగిన 22 మ్యాచ్లలో కేవలం ఒకే ఒక సెంచరీ సాధించాడు.
2008లో ఆస్ట్రేలియా పర్యటనకై ఎంపికై అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్నింగ్సులో శతకాన్ని సాధించాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికాతో జరిగిన చెన్నై టెస్టులో 41 ఫోర్లు, 5 సిక్సర్లతో రెండో ట్రిపుల్ సెంచరీని సాధించాడు.[15] భారత్ తరఫున నమోదై ఉన్న రెండు ట్రిపుల్ సెంచరీలు కూడా ఇతని పేరిటే ఉండటం గమనార్హం. టెస్ట్ క్రికెట్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన వారిలో సెహ్వాగ్ మూడోవాడు. ఇదివరకు డాన్ బ్రాడ్మెన్, బ్రియాన్ లారాలు మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించిన వారిలో ఉన్నారు.
2009 న్యూజీలాండ్ పర్యటనలో చక్కటి బ్యాటింగ్ ప్రదర్శించాడు. హామిల్టన్లో జరిగిన నాలుగవ వన్డేలో కేవలం 60 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి సరికొత్త భారత రికార్డును సృష్టించాడు. న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ క్రో, అతడిని అత్యంత విధ్వంసకరమైన బ్యాట్స్మెన్గా ప్రశంసించాడు.[16]
Remove ads
సాధించిన టెస్ట్ సెంచరీలు
Remove ads
వన్డే సెంచరీలు
అవార్డులు
- 2002లో భారత ప్రభుత్వం అర్జున అవార్డు ప్రధానం చేసింది.[17]
రికార్డులు
- టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారతీయుడు. (319 పరుగులు)
- పాకిస్తాన్ పై అత్యధిక డబుల్ సెంచరీలు (3) సాధించిన భారతీయుడు.[18]
- అతివేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్.
- ఒకే ఇన్నింగ్సులో వరుసగా రెండు డబుల్ సెంచరీ భాగస్వామ్యాలు నమోదుచేసిన రికార్డు.
- 2011 వన్డేవరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు.
టెస్ట్ మ్యాచ్ అవార్డులు
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు
Remove ads
ఇవి కూడా చూడండి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads