ఎం.కరుణానిధి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
ఎం.కెగా, డా.కళైజ్ఞర్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి (తమిళం: மு.கருணாநிதி) M.K (జూన్ 3, 1924 - ఆగష్టు 7, 2018) తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి తాను మరణించేవరకు, తమిళనాడు రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగంకు అధ్యక్షుడు,[2] వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.[3] కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001, 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు.[4] 2004 లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులోని అన్నీ (40) లోక్ సభ స్థానాలలో యూపీఏను గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించాడు. స్వయంప్రకటిత నాస్తికుడైన కరుణానిధి ఇ.వి.రామస్వామి నాయకర్ అనుయాయి.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
ఎం. కరుణానిథి | |||
తమిళనాడు 2వ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 2006 మే 13 – 2011 మే 15 | |||
ఎం. కె. స్టాలిన్ (నుండి 2009) | |||
ముందు | జె.జయలలిత | ||
తరువాత | జె.జయలలిత | ||
నియోజకవర్గం | చేపక్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1996 మే 13 – 2001 మే 13 | |||
ముందు | జె.జయలలిత | ||
తరువాత | జె.జయలలిత | ||
నియోజకవర్గం | చేపక్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1989 జనవరి 27 – 1991 జనవరి 30 | |||
ముందు | జానకీ రామచంద్రన్ | ||
తరువాత | జె.జయలలిత | ||
నియోజకవర్గం | హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1971 మార్చి 15 – 1976 జనవరి 31 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
నియోజకవర్గం | సైదాపేట అసెంబ్లీ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1969 ఫిబ్రవరి 10 – 1971 జనవరి 4 | |||
ముందు | వి.ఆర్.నెడుంచెజియన్(ఆపద్ధర్మ) | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
నియోజకవర్గం | సైదాపేట అసెంబ్లీ నియోజకవర్గం | ||
శాసనసభ్యుడు తిరువారూర్ నియోజకవర్గం | |||
పదవీ కాలం 2011 మే 15 – 2018 ఆగస్టు 7 | |||
ముందు | యు.మాధివానం | ||
నియోజకవర్గం | తిరువారూర్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1924-06-03)1924 జూన్ 3 తిరుకువలై, మద్రాసు రాజ్యం, బ్రిటిష్ రాజ్ (ప్రస్తుతం నాగపట్టిణం జిల్లా, తమిళనాడు) | ||
మరణం | 2018 ఆగస్టు 7(2018-08-07) (వయసు 94)[1] చెన్నై, తమిళనాడు | ||
రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కళగం | ||
ఇతర రాజకీయ పార్టీలు | జస్టిస్ పార్టీ , ద్రావిడర్ ఖగజం (1949 కి ముందు) | ||
జీవిత భాగస్వామి | పద్మావతి అమ్మాళ్ దయాళు అమ్మాళ్ రాజతి అమ్మాళ్ | ||
సంతానం | 6, (ఎం.కె.ముత్తు, ఎం.కె.అళగిరి, ఎం.కె.స్టాలిన్ , ఎం.కె.కనిమొళి లతో పాటు) | ||
నివాసం | గోపాలపురం, చెన్నై |
మూసివేయి