చట్టసభలు
From Wikipedia, the free encyclopedia
రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగమైన శాసన వ్యవస్థయే చట్ట సభలు. దేశానికి చట్టసభలున్నట్లే ప్రతీ రాష్ట్రానికి కూడా చట్ట సభలుంటాయి. జాతీయ చట్టసభలు రెండు- లోక్సభ, రాజ్య సభ. ఈ రెంటినీ కలిపి పార్లమెంటు లేదా సన్సద్ (హిందీ) అంటారు. భారతదేశం లోని కొన్ని రాష్ట్రాలలో చట్ట సభలలో ద్విసభా పద్ధతి అమల్లో ఉంది. ఈ చట్టసభల్లో ఎగువ సభ, దిగువ సభ అని రెండు సభలు ఉంటాయి. ఎగువసభను శాసనసభ లేదా విధానసభ అని దిగువ సభను శాసన మండలి లేదా విధాన పరిషత్తు అని అంటారు. చాలా రాష్ట్రాల్లో ఏకసభ పద్ధతి ఉంది. 1985లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసన మండలిని రద్దు చేసి, ఏకసభా పద్ధతిని ప్రవేశపెట్టాడు. తరువాత శాసన మండలిని మరలా పునరిద్ధరించబడింది.
త్వరిత వాస్తవాలు
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
|
|
|
మూసివేయి