చౌటుప్పల్ మండలం
తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
చౌటుప్పల్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] చౌటుప్పల్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన చౌటుప్పల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది భువనగిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17°15′03″N 78°53′50″E, రాష్ట్రం ...
చౌటుప్పల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°15′03″N 78°53′50″E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి జిల్లా |
మండల కేంద్రం | చౌటుప్పల్ |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 73,336 |
- పురుషులు | 37,303 |
- స్త్రీలు | 36,033 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 63.29% |
- పురుషులు | 75.75% |
- స్త్రీలు | 50.13% |
పిన్కోడ్ | 508252 |
మూసివేయి
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 267 చ.కి.మీ. కాగా, జనాభా 73,336. జనాభాలో పురుషులు 37,303 కాగా, స్త్రీల సంఖ్య 36,033. మండలంలో 17,812 గృహాలున్నాయి.[3]