పశ్చిమ క్షాత్రపులు
From Wikipedia, the free encyclopedia
పశ్చిమ క్షాత్రపులు, సా.శ. 35 నుండి 415 మధ్య, భారతదేశపు పశ్చిమ, మధ్య ప్రాంతాన్ని (సౌరాష్ట్ర, మాల్వా: ఆధునిక గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు) పాలించిన ఇండో-సిథియన్ (శకులు) పాలకులు. వీరిని పశ్చిమ సాత్రపులు అని కూడా అంటారు. వీరు భారత ఉపఖండంలోని ఉత్తర భాగాన్ని పాలించిన కుషాణులకు సమకాలికులు. బహుశా కుషాణులకు సామంతులై ఉండవచ్చు. వారు మధ్య భారతదేశంలో పాలించిన శాతవాహనులకు (ఆంధ్రులు) కూడా సమకాలికులు. సా.శ. 2వ శతాబ్దం వరకు పంజాబ్, మథురలో పాలించిన "ఉత్తర క్షాత్రపుల" నుండి వేరుగా చూపించడానికి ఆధునిక చరిత్ర చరిత్రలో వారిని "పశ్చిమ క్షాత్రపులు" అని పిలుస్తారు.
పశ్చిమ క్షాత్రపులు | |||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
35–415 CE | |||||||||||||||||||||
పశ్చిమ క్షాత్రపుల సామ్రాజ్యం (35–415) సా.శ. 350[1] | |||||||||||||||||||||
రాజధాని | ఉజ్జయిని బరిగాజా మిన్నగారా | ||||||||||||||||||||
సామాన్య భాషలు | పాళీ (ఖరోష్ఠి లిపి) సంస్కృతం, ప్రాకృతం (బ్రాహ్మీ లిపి) | ||||||||||||||||||||
మతం | బౌద్ధం హిందూమతం | ||||||||||||||||||||
ప్రభుత్వం | రాచరికం | ||||||||||||||||||||
క్షాత్రప రాజు | |||||||||||||||||||||
• c. 35 | ఆభీరకులు | ||||||||||||||||||||
• 388–415 | మూడవ రుద్రసింహుడు | ||||||||||||||||||||
చారిత్రిక కాలం | ప్రాచీన రాజవంశం | ||||||||||||||||||||
• స్థాపన | 35 | ||||||||||||||||||||
• పతనం | 415 CE | ||||||||||||||||||||
| |||||||||||||||||||||
Today part of | భారతదేశం పాకిస్తాన్ |
శాతవాహన వంశానికి చెందిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి చేతిలో శక పాలకులు ఓడిపోయిన తర్వాత సా.శ. 2వ శతాబ్దంలో పశ్చిమ క్షాత్రపుల శక్తి క్షీణించడం ప్రారంభమైంది.[2] దీని తరువాత, శక రాజ్యం పునరుద్ధరించబడినప్పటికీ, సా.శ. 4వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యానికి చెందిన రెండవ చంద్రగుప్రుడు దాన్ని నాశనం చేసాడు.[3]
మొత్తంగా, సుమారు 350 సంవత్సరాల కాలంలో 27 మంది స్వతంత్ర పశ్చిమ క్షాత్రప రాజులు పాలించారు.