భారత ప్రభుత్వం
From Wikipedia, the free encyclopedia
భారత ప్రభుత్వం సాధారణంగా కేంద్ర ప్రభుత్వం అని వ్యవహరింపబడుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడింది. దేశంలో గల 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల మీద అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇది భారత రాజధానియైన ఢిల్లీలో కేంద్రీకృతమై ఉంటుంది.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
|
|
|
భారత ప్రభుత్వ యంత్రాంగం మూడు స్వతంత్ర విభాగాలుగా ఏర్పడి ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ . కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్రపతి ఆద్వర్యంలో నడుస్తుంది. శాసన వ్యవస్థ (పార్లమెంటు) ఎగువసభగా పిలిచే రాజ్యసభను, దిగువసభగా పిలిచే లోక్సభను, రాష్ట్రపతిని కలిగి ఉంటుంది. న్యాయ వ్యవస్థ శీర్షమున అత్యున్నత న్యాయస్థానమును (సుప్రీమ్ కోర్టు), 21 ఉన్నత న్యాయస్థానాలనూ (హై కోర్టు), ఇంకా జిల్లా స్థాయిలో పౌర (సివిల్), నేర (క్రిమినల్), కుటుంబ (ఫామిలీ) న్యాయస్థానములను కలిగి ఉంటుంది. భారత పౌరులకు దిశా నిర్దేశము చేయు పౌర విధాన స్మృతి, భారతీయ శిక్షా స్మృతి, నేర విధాన స్మృతి వంటి సాధారణ న్యాయ సూత్రాలను కేంద్ర శాసన వ్యవస్థ రూపొందిస్తుంది. కేంద్ర ప్రభుత్వము వలెనే ప్రతీ రాష్ట్ర ప్రభుత్వమూ కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ లను కలిగి ఉంటుంది. కేంద్రానికి, రాష్ట్రాలకి వర్తించు న్యాయ వ్యవస్థ ఇంగ్లీష్ కామన్, స్టాట్యుటరీ లా ఆధారంగా తయారు చెయ్యబడింది. భారత దేశము కొన్ని సౌలభ్యములతో అంతర్జాతీయ న్యాయ స్థానము ( ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ) ను అంగీకరిస్తోంది. ప్రాంతీయ పరిపాలన కొరకు, అధికార వికేంద్రీకరణకు ఉపకరంచిన పంచాయతీ రాజ్ వ్యవస్థ రాజ్యాంగములోని 73వ, 74వ సవరణల ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది.