భారత రాష్ట్రపతి
గణతంత్ర రాజ్యమైన భారతదేశ దేశాధినేత / From Wikipedia, the free encyclopedia
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారతదేశానికి దేశాధినేత రాష్ట్రపతి (Rashtrapati / President). రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు. అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైంది.
రాష్ట్రపతి భారతదేశం
Bhārat kē Rāṣṭrapati | |
---|---|
విధం | |
రకం | దేశాధిపతి |
Abbreviation | POI |
అధికారిక నివాసం |
|
స్థానం | రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ |
నియామకం | ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ఇండియా |
కాల వ్యవధి | ఐదు సంవత్సరాలు పునరుద్ధరణ పై పరిమితి లేదు |
స్థిరమైన పరికరం | భారత రాజ్యాంగం (ఆర్టికల్ 52) |
అగ్రగామి | భారత రాజు |
నిర్మాణం | 26 జనవరి 1950; 74 సంవత్సరాల క్రితం (1950-01-26) |
మొదట చేపట్టినవ్యక్తి | రాజేంద్ర ప్రసాద్ |
ఉప | భారత ఉప రాష్ట్రపతి |
జీతం | • ₹5,00,000 (US$6,300) (per month) • ₹60,00,000 (US$75,000) (annually)[2] |
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశ రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
రాష్ట్రపతి దేశాధినేతగా 1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిననాటి నుండి గుర్తించబడింది. అప్పటి వరకు గవర్నర్ జనరల్ దేశాధినేతగా ఉండేవాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారతదేశానికి ఇద్దరు గవర్నర్ జనరల్ గా పనిచేసారు.