1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.
1908 – మదర్స్ డే మొట్ట మొదటి సారిగా అమెరికా లోన పడమటి వర్జీనియా లోని గ్రాఫ్టన్ అనే వూరిలో జరిగింది..
1930: అమెరికా లో, మొదటి ప్లానెటోరియం (నక్షత్ర శాల) ను చికాగో లోని, ఆడ్లెర్ నగరంలో ప్రారంభించారు.
1933: నాజీలుజర్మనీలో బహిరంగంగా పెద్ద ఎత్తున పుస్తకాలను తగులబెట్టారు.
1940: చర్చిల్ఇంగ్లాండు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
1950: నెదర్లాండ్ నుంచి అమెరికాకు మొదటి టెలెక్స్ను పంపారు.
1960: అమెరికాకు చెందిన అణు జలాంతర్గామిట్రైటన్ తన 84 రోజుల సుదీర్ఘమైనటువంటి, నీటి లోపల ప్రయాణం, విజయవంతంగా ముగించింది.
1963: పోప్ జాన్ XXIIIకిబల్జాన్ శాంతి బహుమతి పొందాడు. ఇప్పటివరకు ఒక పోప్ (క్రైస్తవ మతాధిపతి) కి ప్రదానం చేసిన మొదటి శాంతి బహుమతి ఇదే
1964: జాంబియా దేశపు అధ్యక్షుడుగా కెన్నెత్ కౌండా అధికారం చేపట్టాడు.
1967: అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
1969: అపోలో-10 వ్యోమ నౌక, రోదసీ నుంచి భూమి ఎలా కనిపిస్తోందో చూసి, మొట్టమొదటి సారిగా, రంగుల చిత్రాలను, తీసి పంపింది.
1972: అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
1976: బ్రిటిష్ రాణి లండన్ లోని నేషనల్ థియేటర్ని ప్రారంభించింది.
1983: అమెరికా సంయుక్త దళాలు గ్రెనడా పై దాడి చేసాయి .
2011: పరువు హత్యలలో (పరువు, మర్యాద లేదని, అవి హత్యలేనని భారతదేశపు న్యాయ స్థానం వెల్లడించింది. (తమ పరువు పోతుందని, తమ ఇంటిలోని ఆడవారిని హత్యలు చేయటమె పరువు హత్య)