జమ్మూ కాశ్మీరు (రాష్ట్రం)
భారతదేశంచే నిర్వహించబడే పూర్వ రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
జమ్మూ కాశ్మీరు (Jammu and Kashmir), /dʒəmmuː ənd kəʃmiːr/, కాశ్మీరీ:ज्वम त॒ कॅशीर, హిందీ:जम्मू और कश्मीर, ఉర్దూ:جموں و کشمیر) భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు. దీనికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రముంది.2019 వరకు లడఖ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక ప్రాంతంగా ఉండేది. 2019 ఆగష్టులో భారత పార్లమెంటు 2019 అక్టోబరు 31 నుండి లడఖ్ ను మరొక కేంద్ర పరిపాలనా ప్రాంతంగా ప్రకటించింది.[1] జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో 20 జిల్లాల ఉన్నాయి.[2] గతంలో అంతర్భాగంగా ఉన్న లడఖ్ ప్రాంతాన్ని మరొక కేంద్రపాలిత ప్రాంతంగా విభజించారు.జమ్మూ కాశ్మీరు రాష్ట్ర శాసనసభలో ప్రస్తుతానికి 90 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
జమ్మూ కాశ్మీరు | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
వేసవిలో శ్రీనగర్, తక్కిన సమయంలో జమ్ము - 34.08°N 74.83°E / 34.08; 74.83 |
పెద్ద నగరం | శ్రీనగర్ |
జనాభా (2001) - జనసాంద్రత |
10,069,917 (18th) - 45.31/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
222, 236 చ.కి.మీ (?) - 22 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[జమ్మూ కాశ్మీరు |గవర్నరు - [[జమ్మూ కాశ్మీరు |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1947 అక్టోబరు 26 - --- - ---- - ద్విసభ (89 + 36) |
అధికార బాష (లు) | కాశ్మీరీ, ఉర్దూ |
పొడిపదం (ISO) | IN-JK |
వెబ్సైటు: jammukashmir.nic.in | |
జమ్ము శీతాకాలంలో రాజధాని |
జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతంలో రెండు విభాగాలున్నాయి.[2]
- జమ్ముూ విభాగం: ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. రాజధాని నగరం పేరు "జమ్మూ ". జమ్ముూ నగరం మందిరాల నగరంగా ప్రసిద్ధం.ఈ విభాగంలో 10 జిల్లాలు ఉన్నాయి
- కాశ్మీరు విభాగం: కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది.ఈ విభాగంలోని శ్రీనగర్ ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్తులు అధిక శాతంలో ఉన్నారు. రాజకీయంగా ఇది చాలా వివాదాస్పదమైన ప్రాంతం. భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య రెండు యుద్ధాలకు కారణం. ఇప్పటికీ వేర్పాటు వాదం, ఉగ్రవాదం ఇక్కడ ప్రబలంగా ఉన్నాయి.ఈ విభాగంలో 10 జిల్లాలు ఉన్నాయి.